HomeTelugu Trendingకరోనాతో ప్రముఖ నిర్మాత మృతి

కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి

Tamil producer v swaminatha
దేశంలో కరోనా విజృంభిస్తుంది.. రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల పలువురు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ తమిళ నిర్మాత, వీ. స్వామినాథన్ కరోనా కారణంగా మరణించారు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన ఈ రోజు ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లక్ష్మీ మూవీ మేకర్స్‌‌ లో స్వామినాథన్ కూడా ఒకడు. ఈయనతో పాటు ఆ నిర్మాణ సంస్థలో కె మురళీధరన్, వేణుగోపాల్‌ భాగస్వాములుగా ఉన్నారు. వీరి నిర్మాణంలో ‘అరణ్‌ మనై కావలన్‌’ అనే సినిమాను తొలిసారిగా 1994లో నిర్మించారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాలను నిర్మించిన ఈయన కొన్ని సినిమలో నటించారు. ఆయన మృతిపై పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu