వివాదాస్పద అంశాలపై స్పందించడంలో రాంగోపాల్ వర్మ ఎప్పుడు ముందుంటాడు. ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అసెంబ్లీ సమావేశాలు. అసలు కంటే ఇతర విషయాలపైనే సమావేశాలలో ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు. గతంలో జరిగిన తప్పులను ఎత్తి చూపడం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. నిందలు వేసుకోవడంతోనే సమయం గడిచిపోతుంది.
దీనిపై వర్మ తనదైన స్టైల్లో స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేది అరవడం, నిందలు వేయడం, గత సమస్యల గురించి ఫిర్యాదు చేయడంతోనే సరిపోతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు పౌరుషాలకు, ప్రతీకారాలకు పోయి ప్రస్తుత రాష్ట్ర భవిష్యత్తు సమస్యలను పక్కన పెడుతున్నారని దీనికి సంబంధించి జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేశారు. చాలా కాలం తరువాత వర్మ ఒక ఇష్యూ మీద పాజిటివ్ గా ట్వీట్ చేయడంతో అందరు షాక్ అవుతున్నారు.
Are the assembly sessions for shouting,blaming,complaining about past issues or to logically discuss current and future issues ? Just asking
— Ram Gopal Varma (@RGVzoomin) June 18, 2019