కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్తో సినిమా షూటింగ్లు, సీరియల్స్ నిర్మాణాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో టీవీల్లో పాత సీరియల్స్ ప్రసారం చేస్తున్నారు. గతంలో దూరదర్శన్లో ప్రసారమైన రామాయణం సీరియల్ ఎంతో మంది వీక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సీరియల్ను తిరిగి ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు ఎక్కువ మంది ఆదరించిన సీరియల్గా రామాయణం రికార్డు క్రియేట్ చేసింది. అప్పట్లో రామాయణం సీరియల్లో నటించిన నటీనటులు మరోసారి తెరపైకి వచ్చారు.
అప్పట్లో రామాయణంలో సీతగా నటించిన దీపికా చిఖాలియా ప్రస్తుతం బాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. ఇప్పుడు రామాయణం సీరియల్ను సినిమాగా తెరకెక్కించడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే రామాయణం సినిమాగా తీస్తే అందులో సీతగా ఎవరు నటించాలి అనే విషయాన్ని అప్పటి సీత క్యారెక్టర్లో నటించిన దీపికను అడిగితే ఆలియా భట్ పేరు చెప్పిందట. అలాగే రాముడిగా హృతిక్ రోషన్ అయితే బాగుంటుందని, లక్ష్మణుడిగా వరుణ్ ధావన్ నటిస్తే బాగుంటుందని తెలిపిందట. రావణాసురుడి పాత్రలో అజయ్ దేవగన్ పేరు సూచించిందట.