HomeTelugu Newsప్రభాస్‌కు జంటగా దీపిక పదుకొనె ‌.. పోస్ట్‌ వైరల్‌

ప్రభాస్‌కు జంటగా దీపిక పదుకొనె ‌.. పోస్ట్‌ వైరల్‌

14 6
టాలీవుడ్ యంగ్‌ రెబల్‌ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు ప్రభాస్‌. ఈ సినిమాకి సంబంధించి నాగ్ అశ్విన్ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ఇక హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట నాగ్‌ అశ్విన్‌. అయితే ముంగా ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుందనే ప్రచారం జరిగింది. తాజాగా దీపికా పదుకొనె పేరు తెరపైకి వచ్చింది. దీనికి దీపిక తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన కామెంటే కారణం.

‘మహానటి’ సినిమాను అందరూ చూడండి అని దీపిక కామెంట్ పెట్టింది. దీనికి కొనసాగింపుగా… తెల్లవారుజామున కూల్ నోటిఫికేషన్ అందుకున్నాను అంటూ నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియా పేజ్ లో పొస్ట్‌ చేశాడు. దీంతో, ప్రభాస్ తో దీపిక నటించనుందనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu