HomeTelugu Trendingసింగర్ సునీత అభిమానులకు గుడ్ న్యూస్

సింగర్ సునీత అభిమానులకు గుడ్ న్యూస్

Singer Sunitha Instagram

ప్రముఖ సింగర్ సునీత అభిమానులకు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే షూటింగ్‌లకు వెళ్లలేకపోతున్నట్లు వెల్లడించారు. కానీ అభిమానులందరికీ కాస్త రిలీఫ్ కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి 8.30 వరకు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో కలుస్తానన్నారు. అంతేకాకుండా అభిమానులు కోరిన పాటలను పాడి వినిపిస్తానని తెలిపారు. నాగార్జున నటించిన నేనున్నాను సినిమాలోని చీకటితో వెలుగే చెప్పెన నేనున్నానని అనే పాట పాడి వైద్యులు, పారిశుధ్య సిబ్బందికి అంకితమిచ్చారు. అత్యవసరమైతే తప్ప అభిమానులు బయటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. తాను, తన కుటుంబ రక్షణ కోసం ఇంటివద్దే ఉంటున్నట్టు సింగర్ సునీత వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu