HomeTelugu Newsదర్శకుడు శంకర్ క్షేమం.. బాధితులను పరామర్శించిన డైరెక్టర్

దర్శకుడు శంకర్ క్షేమం.. బాధితులను పరామర్శించిన డైరెక్టర్

16 5
దర్శకుడు శంకర్ క్షేమంగానే ఉన్నారు. భారతీయుడు-2 సెట్స్‌లో జరిగిన భారీ ప్రమాదం సౌత్ ఇండస్ట్రీలో సంచలన వార్త అయింది. కమల్ హాసన్, శంకర్ లాంటి క్రేజీ కాంబినేషన్‌లో వందల కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కుతున్న సినిమా సెట్‌‌లో ఇంత భారీ ప్రమాదం జరగడం అందరికీ షాకిస్తోంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అంతా స్పందించారు. లైకా ప్రొడక్షన్ హౌజ్ కూడా తమకు ఈ బాధ గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదంటూ ట్వీట్ చేసింది. ఇక కమల్ అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వెళ్లి దగ్గరుండి సహాయ సహకారాలు అందచేశారు. కానీ దర్శకుడు శంకర్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.

డైరెక్టర్‌కు తీవ్ర గాయాలైనట్టు రాత్రి వచ్చిన వార్తలతో అందరూ ఆందోళన చెందారు. ఆయన నిజంగానే క్షేమంగా ఉన్నాడా లేదా అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన హాస్పిటల్‌కు వచ్చారు. కమల్ హాసన్‌తో పాటు ఆయన కూడా వచ్చి ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రమాదం సమయంలో ఆయనకు కూడా గాయాలయ్యాయని ముందు కొన్ని వార్తలు వచ్చినా కూడా అందులో ఎలాంటి నిజం లేదని శంకర్ సన్నిహితులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ముగ్గురు చనిపోయారని.. మరికొందరు గాయపడ్డారని మాత్రమే చెప్పారు కానీ శంకర్ ఎక్కడున్నాడనేది చెప్పలేదు. ఆయన హాస్పిటల్ వచ్చి గాయపడ్డ వాళ్లను పరామర్శించడంతో అందరి అనుమానాలకు తెరదించినట్లయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu