HomeTelugu Trendingశ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి

శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి

1 17
టాలీవుడ్ నటి కరాటే కల్యాణి .. వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సామాజిక మాధ్యమం వేదికగా తనపై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ కరాటే కల్యాణి హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై చర్యలు చేపట్టాలని ఆ ఫిర్యాదులో ఆమె కోరినట్టు సమాచారం. శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసే ఉద్దేశంలో పోలీసులు ఉన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గతంలో కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో తనపై కల్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసిందని నాడు తన ఫిర్యాదులో శ్రీరెడ్డి ఆరోపించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!