HomeTelugu Newsమోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ షురూ!

మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ షురూ!

అర్ధవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. ‘జెంటిల్ మెన్’ లాంటి సూపర్ హిట్ అనంతరం అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నారు. కె.సి.నరసింహారావు నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో ఈష, అదితి మ్యానికల్ కథానాయికలుగా నటించనుండగా.. వెన్నెల కిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషించనున్నాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం జరిగింది.
ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ క్లాప్ కొట్టగా.. వినయ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. ”నేడు పూజా కార్యక్రమాలతోపాటు రెగ్యులర్ షూట్ కూడా మొదలుపెట్టనున్నాం. మణిశర్మ గారు సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్రానికి పి.జి.విందా కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu