యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అందరి అంచనాలను మించి ఈ సినిమా ఉండబోతోందని చిత్రబృందం చెబుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ సర్ ప్రైజ్ ఇస్తామని శనివారం చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్స్ వివరాలను వెల్లడించింది.
ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని సాంకేతిక బృందం ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. అభిమానులు దీంతో సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రభాస్తో నటించాలంటే ఆమాత్రం రేంజ్ ఉండాలి’ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘బాహుబలి రికార్డులు బద్దలే’నంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల ట్వీట్ల వర్షంతో ట్విటర్లో #DeepikaPrabhas ట్రెండింగ్ అవుతోంది.కాగా ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్నాడు. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్ అభిమానులను ఆకట్టుకుంది.