HomeTelugu Newsకరోనా వైరస్‌ పై రఘ కుంచె మాస్‌ సాంగ్‌.. వైరల్

కరోనా వైరస్‌ పై రఘ కుంచె మాస్‌ సాంగ్‌.. వైరల్

13 2
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని హడలెత్తిస్తోంది. ఈ వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. లాక్‌డౌన్ ప్రకటించి సర్వం నిలిపివేశాయి. అయినా సరే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కరోనా నివారణ కోసం వైద్యులు, పోలీసులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు.

ఈ వైరస్‌ పై అవగాహన చేసేందుకు నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె ఓ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ‘కరోనా మహమ్మారి’పై పాట పాడి కను విప్పు కలిగించే ప్రయత్నం చేశారు. ”చెప్పిన మాట వినకుంటే ఓరి నాయనా..సంకనాకి పోతావురా ఓరి నాయనా” అంటూ పాట పాడి వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu