కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం పాండిరాజ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సినిమా అప్డేట్ని అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. ఇప్పటి వరకు 35 శాతం చిత్రీకరణ పూర్తయినట్టు సోషల్ మీడియా ద్వార ప్రకటించారు దర్శకనిర్మాతలు. లాక్డౌన్ ముగిసిన తర్వాత తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించనున్నారు.
జులైలో టైటిల్ని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హీరోగా సూర్యకి ఇది 40వ చిత్రం. ‘సూర్య 40’ వర్కింగ్ టైటితో షూటింగ్ జరుపుకుంటోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో పాండిరాజ్-సూర్య కాంబినేషన్లో ‘పసంగ 2’ చిత్రం రూపొందింది. తెలుగులో ‘మేము’ పేరుతో విడుదలై మంచి విజయం అందుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.