హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో నేషనల్ వైడ్గా పాపులర్ అయ్యారు. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక దర్శకుడు సందీప్ ఈ సినిమానే బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సంచలనం సృష్టించాడు. అయితే ఇప్పుడు మళ్ళీ విజయ్, సందీప్ వంగా జత కట్టబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది. కానీ ఈసారి సినిమా కాకుండా ఓ వెబ్ సిరీస్ లోనట. అయితే అందులో విజయ్ నటించడం లేదు. ఆ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించనున్నాడు అని తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ లో నటించనున్నాడు అని సమాచారం. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాద్ డైరెక్షన్లో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా ఈ వాయిదా పడింది.