HomeTelugu News'శ్రీనివాస్‌ కల్యాణం' తొలి రాగం విడుదల

‘శ్రీనివాస్‌ కల్యాణం’ తొలి రాగం విడుదల

నితిన్‌ హీరో, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస్‌ కల్యాణం’. ఈ సినిమా విడుదలకు సిద్దమౌతున్న విషయం తెలిసిందే. ‘శతమానం భవతి’ ఫేమ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని తొలి పాటను ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా మూవీ యూనిట్‌ రీలిజ్‌ చేసింది.

1 11

‘కళ్యాణం.. వైభోగం.. ఆనంద రాగాల శుభయోగం’ అనే పల్లవితో మొదలై.. రుక్మిణీ కల్యాణం, సీతా స్వయంవరం, శ్రీనివాస కల్యాణ ఘట్టాలను ఉటంకిస్తూ వివాహ ప్రాశస్త్యాన్ని వివరించే ఈ పాట సంగీత ప్రియుల మనసు దోచుకుంటోంది. మిక్కీ జే మేయర్‌ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్‌ అందించగా ఎస్పీ బాలు తన స్వరంతో ప్రాణం పోశారు. చాలా కాలం ఇటువంటి మంచి పాట వినడం సంతోషంగా ఉందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu