యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ మూవీ టీజర్ తనకు చాలా నచ్చిందని స్టార్ హీరోయిన్ అనుష్క అన్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, మందిరా బేడీ, వెన్నెల కిశోర్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్కు అద్భుతమైన స్పందన లభించింది. సినీ ప్రముఖులు, విమర్శకులు టీజర్పై ప్రశంసల జల్లు కురిపించారు. అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్గానూ ఇది రికార్డు సృష్టించింది. కాగా ఈ టీజర్ను చూసిన అనుష్క ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నారు. ‘సాహో’ టీజర్ పూర్తిగా చాలా నచ్చింది. యూవీ క్రియేషన్స్, ప్రభాస్, సుజీత్.. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. సినిమా కోసం ఎదురుచూస్తున్నా’ అని ఆమె పోస్ట్ చేశారు. అనుష్క ప్రస్తుతం తన తర్వాతి సినిమా ‘నిశ్శబ్దం’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.