HomeTelugu Trending'బిగ్‌బాస్‌' 50 లక్షలు గెలిస్తే వారికే ఇస్తా: పల్లవి ప్రశాంత్‌

‘బిగ్‌బాస్‌’ 50 లక్షలు గెలిస్తే వారికే ఇస్తా: పల్లవి ప్రశాంత్‌

bigg boss 7 update
తెలుగు బిగ్ బాస్- 7 చివరిదశకి చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులు ఫైనల్స్ దిశగా వెళుతున్నారు. ఈ క్రమంలో ప్రైజ్ మనీగా 50 లక్షలను గెలుచుకుంటే ఏం చేయాలనుకుంటున్నారనే ప్రశ్న నిన్న ఇంటిసభ్యలుకు ఎదురైంది. అందుకు ఎవరికి వారు, తమ మనసులోని మాటను చెబుతూ వెళ్లారు.

అమర్ దీప్, శోభ, ప్రియాంక సొంత ఇంటికోసం ఆ డబ్బును ఉపయోగించుకుంటామని చెప్పారు. తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితులను గురించి వివరించారు. కొంత తన ఫ్యామిలీ కోసం .. మరికొంత ఛారిటీ కోసం వాడతానని అర్జున్ అన్నాడు. తాను గెలుచుకుంటే అప్పుడు చెబుతానని శివాజీ సమాధానమిచ్చాడు.

పల్లవి ప్రశాంత్ మాత్రం .. తనకి ఆ డబ్బు వస్తే, పంట నష్టాల కారణంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు సాయంగా నిలబడతానని అన్నాడు. తనకి రైతుల కష్టాలు తెలుసనీ, నష్టపోయిన రైతుల కోసమే ప్రతి రూపాయినీ కేటాయిస్తానంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక వీరిలో విజేతగా ఎవరు నిలుస్తారనేది తేలడానికి ఇంకా సమయం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu