HomeTelugu Trendingపశువులకి మనకి తేడా ఉండదు: కొరటాల

పశువులకి మనకి తేడా ఉండదు: కొరటాల

Koratala siva appeals to peటాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ మొదటినుంచి సామజిక అంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ‘రామ్ చరణ్’ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే కొరటాల శివ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. రోజు రోజుకు ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 12 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ సమయంలో కొందరు సినీ ప్రముఖులు స్వచ్చందంగా ముందుకు వచ్చి మాస్క్ ను ధరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ మరోసారి సామజిక బాధ్యతను గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. “ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం (ముక్కు మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం” అంటూ కొరటాల ట్వీట్ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu