HomeTelugu Big Storiesవిడిపోతున్నామంటూ నాగచైతన్య ట్వీట్

విడిపోతున్నామంటూ నాగచైతన్య ట్వీట్

Naga Chaitanya clarify on d

యువ హీరో నాగచైతన్య, సమంతల వైవాహిక బంధానికి తెరపడింది. సమంతతో విడాకులు తీసుకోనున్నట్లు నాగచైతన్య ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విడాకులు విషయంలో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి నాగచైతన్య తెర దించేశాడు. నాగచైతన్య తన విడాకుల వార్త నిజమేనంటూ శనివారం ట్వీట్ చేశాడు. భార్యాభర్తలుగా తమ బంధాన్ని ఇక మీదట కొనసాగించడం లేదని పేర్కొన్నాడు. దశాబ్దానికి పైగా తమ మధ్య ఏర్పడిన స్నేహబంధం గొప్పదని అన్నాడు. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.

ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ సో వేదికగా నాగచైతన్య, సమంత మొత్తం మీద నాగచైతన్య తొలిసారి తమ విడాకుల గురించి మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి
వచ్చినట్టు అయ్యింది. కొన్ని నెలలుగా నాగ చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాతో పాటు ప్రధాన వార్తా పత్రికల్లోనూ విశేషంగా చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చాడు. సమంత మాత్రం సందర్భానుసారంగా ఏదో ఒక
రీతిలో హింట్ ఇస్తూనే ఉంది. ఆమె నెట్ ఫ్లిక్స్ లో నటించబోతున్న ‘డైవోర్స్’ అనే వెబ్ సీరిస్ ప్రమోషన్ కోసమే ఇలాంటి ప్రచారం చేస్తోందనే టాక్ వినిపించింది. సమంత సన్నిహితుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం వారు ఇప్పటికే వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, కోర్టు నుంచి ఆదేశాలు రావడమే తరువాయి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమంతకు భరణంగా నాగార్జున ఫ్యామిలీ రూ.200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడిందని, అయితే ఆ ఆఫర్‌ను సమంత సున్నితంగా తిరస్కరించిందనే వదంతులు వినిపించాయి. ఇవాళ నాగచైతన్య పోస్ట్ చేసిన ట్వీట్‌తో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu