HomeTelugu Trendingముంబై ఎయిర్‌ పోర్టులో ప్రభాస్‌.. ఫొటోలు వైరల్‌

ముంబై ఎయిర్‌ పోర్టులో ప్రభాస్‌.. ఫొటోలు వైరల్‌

Prabhas in mumbai airport
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్నఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. కరోనా ఉద్ధృతి కొంత తగ్గిన వెంటనే చిత్ర యూనిట్ ఇటీలీకి వెళ్లి షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇటలీ షూటింగ్ ముగించుకుని పూజహెగ్డే ఇటీవలే ఇండియాకు వచ్చింది. ఇండియాకు వచ్చిన వెంటనే ‘త్వరలోనే హైదరాబాదులో కలుద్దాం ప్రభాస్’ అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్ పెట్టింది. తాజాగా ప్రభాస్ కూడా తన ఇటలీ షెడ్యూల్ ను ముగించుకున్నాడు. ఇటలీ నుంచి నిన్న రాత్రి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu