HomeTelugu Trendingఅభిమానులతో ఫొటో షేర్‌ చేసుకున్న ప్రభాస్‌

అభిమానులతో ఫొటో షేర్‌ చేసుకున్న ప్రభాస్‌

11 1యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్ ‘సాహో’. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సాహో’ను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

‘హాయ్‌ డార్లింగ్స్‌. ప్రస్తుతం సాహో షూటింగ్‌ ఆస్ట్రియాలో జరుగుతోంది. గతంలో ఇలాంటి అనుభూతులను ఎప్పుడూ చూడలేదు. అద్భుతంగా ఉంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో ప్రభాస్‌తో పాటు హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ కూడా ఉంది.

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో ‘సాహో’ తెరకెక్కుతోంది. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu