HomeTelugu Trendingప్రభాస్‌ ఇంటి ముందు జపాన్‌ లేడీ ఫ్యాన్స్‌ సందడి.. ఫోటో వైరల్‌

ప్రభాస్‌ ఇంటి ముందు జపాన్‌ లేడీ ఫ్యాన్స్‌ సందడి.. ఫోటో వైరల్‌

10 7

‘బాహుబలి’ మూవీ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ క్రేజ్‌ అంతర్జాతీయంగా వ్యాపించింది. ప్రత్యేకించి జపాన్‌లో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించింది. యూనిట్‌ సభ్యులు కూడా ఆ దేశానికి వెళ్లి అభిమానులతో మాట్లాడి, వారి చిరు కానుకలు తీసుకొచ్చారు. కాగా జపాన్‌కు చెందిన కొంత మంది అమ్మాయిలు తాజాగా ప్రభాస్‌ను కలిసేందుకు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి గేటు ముందు ఫొటోకు పోజిచ్చారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్‌ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో ఈ సంఘటన తెలుపుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ సినిమాలో నటిస్తున్నారు. సుజీత్‌ దర్శకుడు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆగస్టు 15న చిత్రం విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!