HomeTelugu Trendingఇటలీ వీథుల్లో ప్రభాస్‌.. ఫొటో వైరల్‌

ఇటలీ వీథుల్లో ప్రభాస్‌.. ఫొటో వైరల్‌

Prabhas Latest pics in italటాలీవుడ్‌ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. నెల రోజుల అనంతరం షూటింగ్ పూర్త కావడంతో ఇటీవల ఈ సినిమా యూనిట్ భారత్ కు వచ్చింది. తాజాగా, ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇటలీలో షూటింగ్ సమయంలో ఆయన ఈ ఫొటోలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు అభిమానులను అలరించాయి. ఈ భారీ బడ్జెట్‌ మూవీ నుండి ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదలచేశారు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu