HomeTelugu NewsRajasekhar: రెండేళ్ల తరువాత ఓటీటీలోకి సీనియర్‌ హీరో సినిమా!

Rajasekhar: రెండేళ్ల తరువాత ఓటీటీలోకి సీనియర్‌ హీరో సినిమా!

RajasekharaRajasekhar: సీనియర్‌ హీరో రాజ‌శేఖ‌ర్ న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ శేఖ‌ర్. 2022లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి జీవిత రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. ఏడేళ్ల త‌ర్వాత శేఖ‌ర్ మూవీతో మెగా ఫోన్ ప‌ట్టింది. మ‌ల‌యాళంలో హిటైన జోసెఫ్ మూవీ ఆధారంగా శేఖ‌ర్ మూవీ రూపొందింది.

ఆత్మీయ రాజ‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో రాజశేఖర్ కూతురుగా శివాని రాజశేఖర్ నటించింది. రాజశేఖర్, శివాని రాజశేఖర్ మరియు జీవిత రాజశేఖర్ కలిసి పనిచేసిన మొదటి చిత్రం శేఖర్. జార్జి రెడ్డి ఫేమ్ ముస్కాన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది.

Rajasekhara

ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. బీరం సుధాకర రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గరం వెంకట శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా థియేట‌ర్ల‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని కోర్డు గొడ‌వ‌ల కార‌ణంగా అర్థాంత‌రంగా నిలిపివేశారు.

థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందు ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. అయితే కోర్టు గొడ‌వ‌లు క్లియ‌ర్ కాక‌పోవ‌డంతో ఓటీటీ సంస్థ‌లు ఈ సినిమాను కొన‌డానికి ముందుకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. శేఖ‌ర్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నట్లు తెలుస్తుంది.

ఓ ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ద్వారా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు స‌మాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu