సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘దర్బార్’. ఈ సినిమా నష్టాల్లో ముంచిందని బయ్యర్లు రజిని ఇంటిదగ్గర ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రజిని తాజాగా నటిస్తున్న సినిమాకు రెమ్యూనరేషన్ తగ్గించారని తెలుస్తుంది.
డైరెక్టర్ శివతో రజనీకాంత్.. ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది రజనీకాంత్ కి 168వ చిత్రం. ఈ మూవీని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ అధినేత కళనిధి మారన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దర్భార్ కు కూడా ఈయనే నిర్మాత. దర్బార్ సినిమాకు రజినీకాంత్ 100 కోట్లు తీసుకున్నారు. ఆ సినిమా గుణపాఠంతో రజినీ తాజా సినిమాకు పారితోషకంలో కొత్త తగ్గించారట. సినిమా పూర్తిగా అమ్ముడు పోయాకే రెమ్యునరేషన్ ఇస్తానని నిర్మాత చెప్పారని సమాచారం. అదికూడా 50 కోట్లు. దాంతో రజనీ రెమ్యునరేషన్ ఒక్కసారిగా 100 కోట్లనుంచి 50 కోట్లకు పడిపోయింది. ఇప్పటికైనా నష్టాలను దృష్టిలో పెట్టుకొని రజిని పారితోషకాన్ని నిర్ణయించాలని సినీ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.