HomeTelugu Trendingపునీత్‌ మృతికి రజనీ సంతాపం.. నెటిజన్ల విమర్శలు

పునీత్‌ మృతికి రజనీ సంతాపం.. నెటిజన్ల విమర్శలు

rajinikanth tweet on puneet
కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ మరణం ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోంది. ఆయన మరణ వార్తతో భారత సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. దీంతో శాండల్‌వుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే స్టార్‌ హీరో, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మాత్రం చాలా ఆలస్యంగా పునీత్‌కు సంతాపం తెలిపారు.

అయితే దానికి కారణం లేకపోలేదు. పునీత్‌ మరణించిన రోజే ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోజే డిశ్చార్జ్‌ అయిన రజనీ అప్పటి నుంచి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పునీత్‌ మరణించిన 12 రోజుల తర్వాత ఆయన సోషల్‌ మీడియా వేదికగా పునీత్‌కు నివాళులు అర్పించారు. అది కూడా ఆయన కూతురు, సినీ దర్శకురాలు సౌందర్య కొత్తగా ప్రారంభించిన హూట్‌ అనే యాప్‌ ద్వారా సంతాపం తెలిపారు.

పునీత్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నువ్వు లేవన్న విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను పునీత్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా నాన్నా’ అంటూ చేసిన ట్వీట్‌ను హూట్ యాప్‌లో తన ఆడియో సందేశ లింకును జత చేశారు. అయితే, ఆయన ఇచ్చిన సందేశంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హుట్‌ యాప్‌ ద్వారా ఆయన సందేశం ఇవ్వడంతో.. ఇది పునీత్‌ మరణానికి చలించినట్టు లేదని, తన కూతురు యాప్‌ను ప్రమోట్‌ చేయడానికి ఆయన మృతిని ఉపయోగించుకున్నట్టు కనిపిస్తోందంటూ పునీత్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu