HomeTelugu Newsబుల్లితెరపైకి సంచలన చిత్రం?

బుల్లితెరపైకి సంచలన చిత్రం?

Sensational movie on the te
టాలీవుడ్‌ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘యానిమల్‌’. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1న రిలీజై భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. యానిమల్ కథను తాను రాసుకున్న విధంగా తెరకెక్కించడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దాదాపు సక్సెస్ అయ్యాడు. ఎంతో ఎఫెక్టివ్‍గా రూపొందించాడు. రైటింగ్‍లోనూ తన మార్క్ చూపించాడు. ఈ మూవీ ఎంగేజింగ్‍గా అనిపించడంలో స్క్రీన్‍ప్లే ముఖ్యమైన పాత్ర పోషించింది.

ఈ సినిమా ప్రారంభం నుండి ఈ మూవీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ సినిమాని మోస్ట్ వైలెంట్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు సందీప్ రెడ్డి వంగా ముందే చెప్పాడు. ఈ సినిమా పిల్లలు చూడకూడదు అని అన్నాడు. తన ఇంట్లో తన పిల్లలకి కూడా ఈ సినిమా చూపించను అన్నాడు. సెలబ్రెటీలు సైతం ఈ సినిమాపై విమర్శలు చేశారు. ఇప్పటికీ కూడా ఎవరో ఒకరు విమర్శలు చేస్తునే ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆ తర్వాత జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. అక్కడ కూడా రికార్డు వ్యూస్‌ సొంతం చేసుకుంది. అంతేకాదు కొన్ని వారాల పాటు టాప్ ట్రెండింగ్ ఇండియన్ మూవీస్ లో తొలి స్థానంలో కొనసాగింది. ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టి 45 రోజులు అవుతున్నా.. ఏడో స్థానంలో యానిమల్ మూవీ కొనసాగుతోంది.

తాజాగా ఈ సినిమా టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతానికి హిందీ వెర్షన్ మాత్రమే సోనీ మ్యాక్స్ ఛానెల్లోకి రానుంది. మిగతా భాషల్లో ఎప్పుడు అనేది ఇంకా తెలియలేదు. యానిమల్ మూవీ టీవీ ప్రీమియర్ తేదీని సోనీ మ్యాక్స్ ఛానెల్ అనౌన్స్ చేసింది. వచ్చే ఆదివారం (మార్చి 17) రాత్రి 7 గంటలకు యానిమల్ హిందీ వెర్షన్ ను టెలికాస్ట్ చేయనున్నట్లు ఈ ఛానెల్ వెల్లడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu