HomeTelugu Trending'తలైవి' న్యూ పిక్స్‌ వైరల్‌

‘తలైవి’ న్యూ పిక్స్‌ వైరల్‌

Thalaivi new stills viral
బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘తలైవి’. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌. పాన్‌ ఇండియా స్థాయిలో డైరెక్టర్‌ ఎ.ఎల్‌. విజయ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొన్ని స్టిల్స్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ని (ఎంజీఆర్‌) జయలలిత కలిసిన సన్నివేశాలున్నాయి. వాటికి సంబంధించిన ఫొటోలే ఇవి. వాటితోపాటు మరో రెండు విభిన్న అవతారాల్లో దర్శనమిచ్చింది కంగనా.

Thalaivi

ఇవి ఈ సినిమాపై అంచాలు పెంచాశాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎంజీఆర్‌ పాత్రని అరవింద స్వామి పోషించారు. ప్రకాష్‌రాజ్‌, పూర్ణ, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌, బ్రిందా ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

Thalaivi2

Recent Articles English

Gallery

Recent Articles Telugu