HomeTelugu Big Storiesచరణ్ విలన్ ను ప్రభాస్ తీసుకున్నాడు!

చరణ్ విలన్ ను ప్రభాస్ తీసుకున్నాడు!

బాహుబలి వంటి క్రేజీ ఫిల్మ్ తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో ‘సాహో’పై ప్రేక్షకులపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ప్రభాస్ మార్కెట్, క్రేజ్ రెండూ బాగా పెరగడంతో మేకర్స్ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ఆయా ప్రాంతపు నటీనటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ను విలన్ గా ఎంపిక చేసుకున్నారు. ఆయనతో పాటు మరో బాలీవుడ్ యాక్టర్ చంకీ పాండేను కూడా ఈ సినిమాలో భాగంగా చేశారు. ఇప్పుడు ఓ తమిళ నటుడుని ఈ సినిమా కోసం రంగంలోకి దింపనున్నారు. అతడే అరుణ్ విజయ్. కోలీవుడ్ లో అరుణ్ కు మంచి పేరుంది. అతడు అజిత్ కు విలన్ గా నటించిన సినిమా ‘ఎంతవాడు గానీ’ పేరుతో తెలుగులో విడుదలైంది.
ఆ సినిమా తరువాత రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ సినిమాలో విలన్ గా అరుణ్ విజయ్ ను ఎన్నుకున్నారు. ఈ రెండు సినిమాలతో అరుణ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు తమిళ ఆడియన్స్ ను ఆకర్షించడానికి అరుణ్ ను ‘సాహో’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణదశలో ఉంది. ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ విషయంలో క్లారిటీ రాలేదు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. 
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!