HomeTelugu Trendingఆలియా-మహేష్‌ భట్‌ పై పోలీస్ కేసు..

ఆలియా-మహేష్‌ భట్‌ పై పోలీస్ కేసు..

6 3బాలీవుడ్‌లో యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీల మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మరియు ఆమె తండ్రి మహేష్ భట్ పైన కూడా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా తాజాగా ‘స‌డ‌క్-2’ పోస్ట‌ర్ పై కేసు నమోదు అయింది. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉందంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఆ సినిమా ద‌ర్శ‌కుడు మ‌హేశ్ భ‌ట్‌తో పాటు నిర్మాత‌ ముఖేశ్ భ‌ట్, న‌టి ఆలియా భ‌ట్‌పై సెక్ష‌న్ 120బీ, 295ఏ కింద సికంద‌ర్‌పూర్‌కు చెందిన ఆచార్య‌చంద్ర కిషోర్ అనే వ్య‌క్తి ఈ కేసు పెట్టారు. .సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో కైలాస్‌ మానస సరోవర్‌ నుచూపించినందుకు ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ కేసుపై మహేష్ భట్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా 1991 సంవ‌త్స‌రంలో విడుద‌లైన ‘స‌డ‌క్’ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుమారు 20 ఏళ్ల తర్వాత మహేశ్ భట్ మళ్లీ దర్శకత్వం వహిస్తూ కూతురు ఆలియాతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu