HomeTelugu Newsహాజీపూర్‌ కేసు: శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష

హాజీపూర్‌ కేసు: శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష

11 5
హాజీపూర్‌ హత్యల కేసులో దోషి శ్రీనివాస్‌రెడ్డికి మరణశిక్ష పడింది. ఈ మేరకు అతడికి మరణశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో 20 ఏళ్లు కూడా నిండని ముగ్గురు అమ్మాయిలను అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కిడ్నాప్‌, అత్యాచారం, హత్య చేయడంపై గతేడాది ఏప్రిల్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. అంతకుముందే కర్నూలు జిల్లాలో అతడిపై మరో హత్యకేసు నమోదైంది. బాధితులంతా మైనర్లు కావడంతో నిందితుడిపై చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు మూడు నెలల పాటు బాధితుల తల్లిదండ్రులు, బంధువులు, ప్రత్యక్ష సాక్షులు, ఫొరెన్సిక్‌ నిపుణులు, పోలీసులు, పంచనామా చేసినవారు.. ఇలా మొత్తం 101 మంది సాక్షులను పోక్సో కోర్టు విచారించింది. నేరాలు రుజువుకావడంతో తాజాగా తీర్పు వెలువరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu