విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి హీరో హీరోయిన్లుగా తెరక్కెకుతున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తోన్న ఈ మూవీ టీజర్ను సూపర్స్టార్ మహేష్బాబు శుక్రవారం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘అనగనగా ఒక అందమైన పల్లెటూళ్లో అందమైన వెంకట లక్ష్మి ఉండేది. అదే ఊళ్లో ఉంటున్న ప్రభుకి వెంకట లక్ష్మి అంటే చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. అదే సమయంలో వెంకటలక్ష్మి వాళ్లింటికి క్రిష్ అనే మరో యువకుడు వస్తాడు. అతను కూడా వెంకట లక్ష్మిని ఇష్టపడతాడు. అదే సమయంలో కథలో అనుకోని మలుపు తిరుగుతుంది. వెంకటలక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? అని చెప్పడంతో టీజర్ ప్రారంభమౌతుంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్ ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 6న ‘ఓ పిట్టకథ’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.