HomeTelugu Trendingప్రభాస్‌ సినిమాకు కరోనా కష్టాలు..

ప్రభాస్‌ సినిమాకు కరోనా కష్టాలు..

1 8
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో కొంతకాలంగా షూటింగ్ జరుగుతుంది. ఆ తరువాత షెడ్యూల్ ను ఆస్ట్రేలియాలో ప్లాన్ చేశారు.

అయితే ‘కరోనా వైరస్’ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ సమయంలో అక్కడికి వెళ్లే ఆలోచనను ఈ సినిమా టీమ్ విరమించుకున్నట్టుగా సమాచారం. ఆస్ట్రేలియా షెడ్యూల్ కోసం మరింత కాలయాపన చేయకుండా, హైదరాబాద్ లోనే సెట్స్ వేసి, ఆ షెడ్యూల్ ను కూడా ఇక్కడే చిత్రీకరించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలెట్టారని టాక్‌. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu