HomeTelugu Newsమహేష్‌ నో చెప్పిన కథ ప్రభాస్‌కు నచ్చుతుందా!

మహేష్‌ నో చెప్పిన కథ ప్రభాస్‌కు నచ్చుతుందా!

2 26
టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఇదిలా ఉంటే మహేష్ 27 వ సినిమా పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లి తో ఉంటుందని అంతా అనుకున్నారు. ఒకానొక సందర్భంలో వంశీ కూడా ఈ విషయాన్నీ ప్రకటించాడు. తాజాగా వంశీ ప్లేస్ లోకి వేరే డైరెక్టర్ పేర్లు విస్పిస్తున్నాయి. వంశీ చెప్పిన కథ మహేష్ కు నచ్చలేదని దాంతో మహేష్ వేరే దర్శకుల వైపు చూస్తున్నాడని సమాచారం. స్క్రిప్ట్ లో లోపాలు ఉండడం తో ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టాడట మహేష్. ఈ విషయం అధికారికంగా బయటకు రానప్పటికీ.. ఇదే జరిగిందని ఇండస్ట్రీ లో అంత మాట్లాడుకుంటున్నారు. మహేష్ కాదనడంతో ఇదే కథను ప్రభాస్ కు వినిపించాడట వంశీ . ప్రభాస్ కూడా ఈ కథ పై ఆసక్తి చూపడని తెలుస్తుంది. గతంలో వంశీ ప్రభాస్ తో ‘మున్నా’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. మరి మహేష్ నో చెప్పిన ఈ కథను ప్రభాస్ చేస్తాడేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu