HomeTelugu News'త్రీ ఇడియట్స్‌' సీక్వెల్‌

‘త్రీ ఇడియట్స్‌’ సీక్వెల్‌

2009లో విడుదలైన ‘త్రీ ఇడియట్స్‌’ అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో ‘ఆమిర్‌ ఖాన్‌, ఆర్‌. మాధవన్‌, శర్మన్‌ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. కరీనా కపూర్‌ కథానాయిక. రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకుడు. వినోద్‌ చోప్రా ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. ముగ్గురు స్నేహితుల కాలేజీ రోజులను ఈ సినిమాలో చూపించారు. . కేవలం రూ.55 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం దాదాపు రూ.459 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు చెప్పారు. ఆ తర్వాత ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడు శంకర్‌ రీమేక్‌ చేశారు. ఇందులో విజయ్‌, శ్రీకాంత్‌, సత్యన్‌ నటించారు. ఇలియానా కథానాయిక. ‘ఇడియట్స్’ మరో సారి వెండితెరపై సందడి చేయడానికి వస్తున్నారు.

8 12

ఇప్పుడు ‘త్రీ ఇడియట్స్‌’ సీక్వెల్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు రాజ్‌ చెప్పారు. రచయిత జోషి స్క్రిప్టు పనులను కొన్ని రోజుల క్రితం ప్రారంభించినట్లు తెలిపారు. నెమ్మదిగా కథను సిద్ధం చేస్తున్నామని, తొందర పడటం లేదని అన్నారు. మరి ఈ సీక్వెల్‌లో ఎవరు హీరోగా కనిపించనున్నారో తెలియాలంటే వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu